న్యూ ఢిల్లీ, నవంబర్ 23: అంతర్జాతీయంగా ముడిచమురు దరలు తగ్గడం,డాలర్తో రూపాయి మారకం విలువ బలపడటంతో గత కొన్నిరోజులుగా పెట్రోల్,ధరులు తగ్గుతున్న విషయం తెలిసిందే శుక్రవారం రోజు కూడా ఇంధన ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో అక్టోబరు 18 నుంచి నవంబరు 23 వరకు పెట్రోల్ ధర రూ. 8.43 తగ్గడం విశేషం.
దేశ రాజధాని ఢిల్లీ లో ఈరోజు పెట్రోల్పై 40 పైసలు తగ్గి లీటర్ ధర రూ. 75.57గా ఉంది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.50, కోల్కతాలో రూ. 77.53, చెన్నైలో రూ. 78.46, హైదరాబాద్లో రూ. 80.12గా ఉంది.