సిడ్నీ, నవంబర్ 23: ఆస్ట్రేలియాతో రెండో టీ20కి టీం ఇండియా సిద్దమైంది .టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. ఈ సందర్బంగా విరాట్ మాట్లాడుతూ..బ్యాటింగ్, బౌలింగ్ల్లో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలో దిగుతున్నట్లు విరాట్ వివరించాడు. ఆస్ట్రేలియా జట్టులోకి మాత్రం బిల్లీ స్టాన్లేక్ స్థానంలో నాథన్ కౌల్టర్ నైల్ వచ్చాడు. సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో భారత్ కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమిష్టిగా రాణించి కంగారూలను ఖంగు తినిపించాలని భారత్ భావిస్తుంది.