జైపూర్, నవంబర్ 23: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు ఎంతో రసవత్తరంగా మారుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ లో అంతర్గత పోరు మొదలైంది. ఇప్పటికే టికెట్ ఆశించి నిరాశ చెందిన కొందరు నేతలు బిజెపి ను వీడగా.. మరికొందరు తిరుగుబాటు గళమెత్తారు. అలా తిరుగుబాటు చేసిన నేతలపై బిజెపి క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది. 11 మంది రెబల్స్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు.