భారత్-ఆసీస్ రెండో టీ20 రద్దు

     Written by : smtv Desk | Fri, Nov 23, 2018, 05:41 PM

 భారత్-ఆసీస్ రెండో టీ20 రద్దు

సిడ్నీ నవంబర్ 23: భారీ వర్షం కారణంగా భారత్-ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 రద్దయింది. వరుణుడి దెబ్బకు అంపైర్లు ఓవర్లని రెండుసార్లు కుదించారు. వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, ఖలీల్ చెరో రెండు వికెట్లు తీయగా, బుమ్రా, కుల్‌దీప్, కృనాల్ తలో వికెట్ తీశారు. కాగా, మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.. దీనితో భారత్ ఒక సరికొత్త రికార్డు ను చేజార్చుకుంది





Untitled Document
Advertisements