న్యూ ఢిల్లీ, నవంబర్ 25: కేంద్ర మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జాఫర్ షరీఫ్ కన్నుమూశారు.శుక్రవారం ఆయన కారు ఎక్కే సమయంలో కుప్పకూలిపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఫోర్టిస్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స ఉంచారు. అయినప్పటికీ.. ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని డాక్టర్లు తెలిపారు.రెండేళ్ల క్రితమే ఛాతీలో అసౌకర్యంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో, ఆయనను పరీక్షించిన వైద్యులు పేస్ మేకర్ అమర్చుకోవాలని సూచించారు. మరోవైపు, జాఫర్ షరీఫ్ మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.