అమరావతి , నవంబర్ 26: : యువనేస్తం పథకంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష జరిపారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతు యువనేస్తంలో అర్హుల సంఖ్య 4 లక్షలు దాటినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. మరింత మంది దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. డిసెంబర్ 10 నుంచి నైపుణ్య శిక్షణ ప్రారంభమవుతుందని మంత్రి లోకేష్ తెలిపారు.యువనేస్తం పథకం కింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 2,07,000 మందిని అర్హులుగా గుర్తించింది. మరో 20 వేల మందిని అర్హులుగా గుర్తించి, ప్రతినెలా నిరుద్యోగ భృతి అందజేసేందుకు టీడీపీ సర్కార్ సిద్ధమైంది.