హైదరాబాద్, డిసెంబర్ 08. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. హైదరాబాద్ నగర ఓటరు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3గంటల సమయంలో హైదరాబాద్లో కేవలం 35 శాతమే పోలింగ్ నమోదవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ ట్వీట్ పెట్టారు. ‘హైదరాబాద్కు ఏమవుతోంది? 3 గంటల సమయంలోనూ ఇంకా 35 శాతమే పోలైందా? నగర ఓటర్లు సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.17 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ నియోజకవర్గంలో 75.75శాతం పోలింగ్ నమోదు కాగా, యాకుత్పురాలో అత్యల్పంగా 32శాతం నమోదవడం గమనార్హం.