విజయవాడ, డిసెంబర్ 09 : విజయవాడ కనక దుర్గగుడి సిబ్బందికి డ్రస్కోడ్ అమలు చేయాలని ఆలయ ఈవో నిర్ణయించారు. డ్రస్కోడ్ను నూతన సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆలయ కౌంటర్లో చీరలు అందుబాటులో పెట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.