‘2.ఓ’ థియేటర్‌లో సతీసమేతంగా రజనీ

     Written by : smtv Desk | Sun, Dec 09, 2018, 04:28 PM

‘2.ఓ’ థియేటర్‌లో సతీసమేతంగా రజనీ

చెన్నై , డిసెంబర్ 09 : తమిళ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ‘2.ఓ’ వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజై పదిరోజులు గడుచినా.. ‘2.ఓ’ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా ఈ మూవీని త్రీడీ వర్షెన్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లు కలెక్ట్‌చేసి ఆల్‌టైమ్‌ రికార్డులను క్రియేట్‌ చేసింది.

కాగా రజనీ.. నిన్న(డిసెంబర్‌ 8) చెన్నైలోని సత్యం థియేటర్‌లో తన సతీమణి లతా రజనీకాంత్‌, మనువళ్లతో కలిసి ‘2.ఓ’ ను వీక్షించారు. అయితే అక్కడికి వచ్చిన మిగతా ఆడియెన్స్‌ రజనీకి ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా వారు ఉన్న చోటు నుంచే సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడిపోయారు. రజనీ సాధారణ ప్రేక్షకుడిలా మారి తన సినిమానే వీక్షిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.





Untitled Document
Advertisements