హైదరాబాద్ , డిసెంబర్ 10 : .
ప్రఖ్యాత నటి రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'బాహుబలి' మొదటిస్థానంలో కనిపిస్తుంది. ఆ సినిమా గురించి 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' తాజా ఇంటర్వ్యూలో సీనియర్ కథానాయిక ఖుష్బూ మాట్లాడారు. "రమ్యకృష్ణ చాలా బ్రిలియంట్ ఆర్టిస్ట్ .. మేమిద్దరం మంచి స్నేహితులం. శివగామి గా ఆమె నటన చూడగానే నాకు చాలా జెలసీగా అనిపించి వెంటనే ఫోన్ చేసి తిట్టేసి అద్భుతమైన ఆమె నటన చూసి తనకి చాలా జెలసీగా అనిపిస్తుందని కూడా చెప్పాను. దాంతో రమ్యకృష్ణ నవ్వుతూ .. 'థ్యాంక్యూ' చెప్పింది.
'నరసింహా' సినిమా లో నీలాంబరి పాత్ర తరువాత ఆమెకి లభించిన అరుదైన పాత్ర ఇది. ఇద్దరి పిల్లలకి ఒకేసారి పాలిచ్చే సన్నివేశంలో రమ్యకృష్ణ నటనచూసి, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆమె నటనకి నేషనల్ అవార్డు రాక పొతే రాకపోతే రమ్యకృష్ణకన్నా ఎక్కువగా నేను డిజప్పాయింట్ అవుతాను " అని చెప్పుకొచ్చారు.