చత్తీస్‌గఢ్‌లో వెనకబడిన బీజేపీ

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 11:37 AM

చత్తీస్‌గఢ్‌లో  వెనకబడిన బీజేపీ

న్యూ ఢిల్లీ , డిసెంబర్ 11: చత్తీస్‌గఢ్‌లో గెలుపుపై ధీమాగా ఉన్న అధికార పార్టీ బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12, బీఎస్పీ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిలాస్‌పూర్‌లో వాణిజ్యశాఖా మంత్రి అమర్ అగర్వాల్ ఆధిక్యంలో కొనసాగుతుండగా కోబ్రా నియోజకవర్గంలో జైసింగ్ అగర్వాల్ ఆధిక్యంలో ఉన్నారు.

ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లపై ఆధిక్యంలో ఉన్నారు. గోండ్వానాలో గణతంత్ర పార్టీ అభ్యర్థి హిరా సింగ్ మక్రం ఆధిక్యంలో ఉన్నారు. ఖరాసియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేశ్ పటేల్ ఆధిక్యంలో ఉన్నారు.





Untitled Document
Advertisements