అతికష్టం మీద గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్..!

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 12:57 PM

అతికష్టం మీద గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్..!

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ఎన్నికల్లో తెరాస పార్టీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ కేవలం 197 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థిపై అతికష్టం మీద విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ రీకౌంట్టింగ్ కోరే అవకాశం ఉందని సమాచారం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో (జగిత్యాల, కోరుట్ల, వర్దన్నపేట, కంటోన్మెంట్) ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచార ప్రకారం తెరాస 85 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, మహాకూటమి 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ రెండు, మజ్లిస్ పార్టీ మూడు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.





Untitled Document
Advertisements