2.ఓ ఎఫెక్ట్

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 12:58 PM

2.ఓ ఎఫెక్ట్

చెన్నై ,డిసెంబర్ 11 :
శంకర్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా వచ్చిన చిత్రం రోబో 2.ఓ . ఈ చిత్రం ద్వారా శంకర్ ప్రేక్షకులకి ఒక సందేశం ఇచ్చాడు . అదేంటంటే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల జంతు జీవజాలం అంతరించిపోతుందని , అది చివరికి మన అంతానికి దారితీస్తుందని , సెల్ ఫోన్ వాడకం వల్ల పక్షిజాతులుఅంతమవుతున్నాయని తెలియజెప్పారు. అంతే కాకుండా మనం వాటి మనుగడకి ఎదోవిధంగా సహాయం చేయడం మన కనీసం భాద్యత అని సందేశం ఇచ్చారు .
ఆ సందేశం తో కనువిప్పు పొంది కొందరు తమ ఇంటి గోడలపై పక్షుల కోసం ధాన్యపు గింజలు నీటి ఉంచారు . కాగా తన పడిన తపనకు ఇలాంటి స్పందన రావడం తో ఆ వీడియో లింక్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు .





Untitled Document
Advertisements