హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెరాస పార్టీ విజయ యాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ సనత్ నగర్ లో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘనవిజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, ప్రజాకూటమి అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్పై తలసాని శ్రీనివాస్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్ పై ఆయన 30,217 ఓట్ల మెజారిటీతో విజయభేరి మోగించారు. కూటమి పొత్తుల్లో భాగంగా చివరలో తెదేపాకు సనత్నగర్ స్థానాన్ని కేటాయించారు.
2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డిపై ఘనవిజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిస్థితుల కారణంగా తెరాసలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాలుగున్నరేళ్లలో పలు అభివృద్ధి పనులపై దృష్టి సారించి, సనత్నగర్లో తెరాసకు క్యాడర్ బలం చేకూర్చారు.