ఢిల్లీ , డిసెంబర్ 11 :
అసెంబ్లీ ఎన్నికలు సందర్భం గా మాటల యుధం జోరుగా సాగుతోంది . గెల్చిన వాళ్ళు వాళ్ళ గెలుపుకు కారణాలు చెబుతూ ఓడిన పార్టీలని దుయ్యబడుతున్నారు . అందులో భాగంగా " బిజెపి ఓటమికి అనేక కారణాలున్నాయి, బీజేపీ వాళ్లు, నోట్ల రద్దు వంటి నిరుపయోగమయిన నిర్ణయాలతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారు ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచారు"అని విమర్శలు చేసారు. అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేయాలి. బలమైన ఫెడరల్ ఫ్రంట్ అనేది బలమైన భారతదేశ నిర్మాణానికి అవసరం . రాష్ట్రాలు భారతదేశం యొక్క స్తంభాలు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు .