హైదరాబాద్, డిసెంబర్ 11: మంథని అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్బాబు మంథని స్థానం నుండి విజయం సాధించారు. 15,985 ఓట్ల ఆధిక్యంతో శ్రీధర్ బాబు సమీప తెరాస అభ్యర్థి పుట్ట మధుకర్ పై గెలుపొందారు. ఈ నేపథ్యంలో మంథని ప్రజలు శ్రీధర్ బాబు కి బ్రహ్మరథం పట్టారు.