పవన్ జర భద్రం : పరుచూరి

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 06:33 PM

పవన్ జర భద్రం : పరుచూరి

హైదరాబాద్ , డిసెంబర్ 11 :
ప్రఖ్యాత రచయిత పరుచూరి గోపాల కృష్ణ గారు మన తెలుగు ప్రజలకి సుపరిచితమే . ఆయన తన ప్రయాణంలో తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి ఆది నుండి ఎన్నో వైవిధ్యమయిన సినిమాల కి కథలు, మాటలు అందించారు . కాగా అయన తన అనుభవాలని పంచుకోవడానికి , సమకాలీన పరిస్థితుల మీద స్పందించడానికి "పరుచూరి పలుకులు " అని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల మీద తమ శైలిలో స్పందన తెలియజేస్తారు .
అయితే తాజాగా అయన గతంలో జరిగిన పలు చారిత్రిక తప్పిదాల గురించి ప్రస్తావిస్తూ , ప్రస్తుతం ప్రజా క్షేత్రం లో కవాతులు చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఉదేశిస్తూ " నేను ఓడిపోతే ... , నేను సి ఎం అవుతా " ఇలాంటి మాటలూ అస్సలు అనకూడదని అన్నారు . వ్యక్తిగత దూషణలు కూడా చెయ్యడం అంత మంచి పద్ధతి కాదని , ప్రజా సమస్యల పై స్పందిస్తే మంచి భవిష్యత్తు ఉంటదని హితవు కోరి ఆశ్విరదించారు .





Untitled Document
Advertisements