డిపాజిట్‌ కూడా దక్కనిది వీరికే..!

     Written by : smtv Desk | Wed, Dec 12, 2018, 10:43 AM

డిపాజిట్‌ కూడా దక్కనిది వీరికే..!

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కొంత మందికి డిపాజిట్లు కూడా రాలేదు. తెలంగాణాలో మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1821 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా 1515 మంది అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. ప్రధానంగా.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఉప్పల్‌ అభ్యర్థి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఆంధోల్‌ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన సినీ నటుడు బాబూమోహన్‌, మహాకూటమి తరఫున బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్‌ డిపాజిట్‌ కోల్పోయారు.

మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ పార్టీ 30కి పైగా స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. టీజేఎస్‌కు అంబర్‌పేట, ఆసిఫాబాద్‌, దుబ్బాక, సిద్దిపేట, మల్కాజిగిరిలలో డిపాజిట్లు దక్కలేదు. ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు సైతం నాలుగు చోట్ల డిపాజిట్‌ కోల్పోయారు.





Untitled Document
Advertisements