జియో తో ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వైభోగం

     Written by : smtv Desk | Thu, Dec 13, 2018, 01:32 PM

జియో తో ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వైభోగం

ఉదయపూర్ , డిసెంబర్ 13 :
మాములుగా పెళ్ళికయ్యే ఖర్చు ఎంత ఉంటది ఒక మిడిల్ క్లాస్ అయితే కట్నకానుకల మినహా 5-15 లక్షల అవ్వుద్ది , అప్పర్ మిడిల్ క్లాస్ అయితే ఇంకొన్ని లక్షలు ఖర్చు చేస్తారేమో . సరిగ్గా చెప్పాలంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఖర్చు చేస్తారు. ఇంకా సెలెబ్రిటీల వివాహాల గురించి మాట్లాడుకుంటే గతానికి బిన్నంగా అదో ఒక ప్రత్యేకత తో జరగాలని చూస్తుంటారు. దాని కోసం ఎంత ఖర్చుకయినా వెనకాడరు . తాజా గా అలాంటి కాస్ట్లీ పెళ్ళీ వొకటి ఉదయపూర్లో జరిగింది అదే అపరకుబేరుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు - చమురు మరియు జియో టెలికాం వ్యాపారవేత్త ముకేష్ అంబానీ , కుమార్తె "ఇషా అంబానీ " వివాహం . వరుడు అజయ్ పిరిమాల్ కొడుకు ఆనంద్ పిరిమాల్ అతను కూడా బిలియనీరే.

నిన్న జరిగిన ఈ పెళ్ళికి 100 చార్టెర్డ్ విమానాలను దేశవిదేశాల నుండి హాజరయ్యే అతిథుల్ని తీసుకురావడానికి వాడారు. ఈ వివాహ వేడుకలు 7 రోజుల పాటు కోలాహలం గా జరిగాయి, వాటిలో భాగం 4రోజుల పాటు 3పూట్లా 5100 మందికి అన్నదానం చేశారు.వేలమంది పైగా హాజరయిన ఈ వివాహం కి అయిన ఖర్చు దాదాపు 700 కోట్లని అంచనా . దీనితో ఈ పెళ్లి దేశం లోనే అతి ఖరీదయిన వివాహం గా నమోదవుతుంది .

కాగా ఈ పెళ్లికయిన ఖర్చు మీద ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. నెటిజెన్లయితే ఈ పెళ్లి కి అయిన ఖర్చు మేమే చేసాం అని చమక్కులేస్తున్నారు అది ఎలా అంటే దేశం లో 80వేల కోట్లమంది జియో యూజర్లు ఉన్నారు వొకొక్కరు వొక సారి 399 రీఛార్జ్ చేస్తే దాదాపు గా 32 లక్షలు కోట్లు వస్తాయి వాటిలో 700 కోట్లెన్తా ? అని సెటైర్ లు వేస్తున్నారు .

ప్రపంచ ప్రముఖులు హాజరయిన ఈ వివాహానికి మన తెలుగు రాష్ట్రాల నుండి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
హీరో ప్రభాస్ తదితరులు హాజరయ్యారు .





Untitled Document
Advertisements