తమిళనాడు, డిసెంబర్ 18: ప్రముఖ పార్టీ అన్నా డీఎంకే దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్సకోసం ఇంకా రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉందని చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఏఐడీఎంకే పార్టీకి బిల్లులు సమర్పించారు. జయ లలిత చికిత్స మొత్తం ఖర్చు రూ.6.85 కోట్లు. ఈ మొత్తం బిల్లులు, ఇప్పటి వరకు చెల్లించిన బిల్లును ఆసుపత్రి వర్గాలు అన్నా డీఎంకే పార్టీ అధిష్టానానికి అందజేశాయి. జయ మరణానికి ముందు అపొలో ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆమె మరణంపై పలు అనుమానాలు రేకెత్తాయి. జయ మరణం అనుమానాస్పదంగా ఉందనే ఆరోపణలపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ విచారిస్తోంది.