ఈ నెల 21 నుండి 26 వరకు బ్యాంకులకి సెలవు

     Written by : smtv Desk | Tue, Dec 18, 2018, 04:48 PM

ఈ నెల 21 నుండి 26 వరకు బ్యాంకులకి సెలవు

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: ఈ నెల 21 నుండి 26 వరకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. గత నెలలో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆ సమయంలో ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాబ్లమ్ మళ్ళీ రాబోతుంది. ఈనెలలో కూడా బ్యాంకులకు వరుసగ ఐదు రోజుల సెలవు దినాలు ఉన్నాయి. 21న ఆలిండియా బ్యాంకు ఆఫీసర్ల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. 22 నాలుగో శనివారం.. 23న ఆదివారం. ఇక సోమవారం 24న ఒక్కరోజు బ్యాంకులు పనిచేయనుండగా 25న క్రిస్మస్ సెలవు. మళ్ళీ 26 యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకి పిలుపునిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపడుతున్నాయి. కాగా ఈ వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం తెలుసుకుని ముందుగానే డబ్బు డ్రా చేసుకుంటున్నారు వినియోగదారులు.





Untitled Document
Advertisements