గుంటూరు, డిసెంబర్ 18: నిత్యం వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఈరోజు తీవ్ర అవమానం జరిగింది. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ సిబ్బంది చింతమనేని ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారును నిలిపివేశారు. తాను ఎమ్మెల్యేనని స్వయంగా చింతమనేని చెప్పినా టోల్గేట్ సిబ్బంది కారును పోలివ్వలేదు. టోల్గేట్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చింతమనేని.. కారును టోల్గేట్ వద్ద విడిచిపెట్టి బస్సు ఎక్కి వెళ్లిపోయారు.
తాను ఎమ్మెల్యేను అనీ, తనకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని చెప్పిన, సిబ్బంది మాత్రం డబ్బులు చెల్లించాకే ముందుకు వెళ్లాలన్నారు. దీంతో తన కారును టోల్ గేట్ వద్ద వదిలేసి అటుగా వెళుతున్న బస్సు ఎక్కివెళ్లిపోయారు. చింతమనేని కారు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ లేకుండా రావడం వల్లే ఈ సంఘటన జరిగిందని సమాచారం.