న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ నిన్న జైపూర్ వేదికగా జరిగిన వేలంలో చివరి వరకు అమ్ముడుపోకుండా ఉన్న యువరాజ్సింగ్ను..ముంబై జట్టు కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యువీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి అనుభవాన్ని తాను ముందే ఊహించినట్లు తెలిపాడు. తొలి దశలో తన పేరు రానందుకు బాధగా లేదని, దానికి కారణం ఫ్రంచైజీల దృష్టి మొత్తం యువ క్రికెటర్లపై ఉంటుంది. తొలినాళ్లలో ఇలాంటి అనుభవాలు తనకూ ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో కోచ్గా జహీర్ఖాన్, కెప్టెన్గా రోహిత్ శర్మ, మెంటార్గా సచిన్ ఉన్నారు. ఈ జట్టులో ఉన్నందుకు తనకు సంతోషంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఆకాశ్ అంబానీ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు.