న్యూఢిల్లీ , డిసెంబర్ 22: 2019 ఐపిఎల్ సీజన్ కోసం ఈ మధ్యే ఆటగాళ్ళ వేలం జరిగింది. ఇప్పటి వరకు ఢిల్లీ డేర్డెవిల్స్ తరపున ఆడిన ఆఫ్స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జయంత్ యాదవ్ను ముంబై ఇండియన్స్ జట్టు తీసుకుంది. దీంతో ముంబై 25 మందితో తమ కోటాను పూర్తి చేయగా, ఢిల్లాకి మరో ఖాళీ ఏర్పడింది. 2015 నుంచి ఢీల్లి జట్లులోనే ఉన్న జయంత్ 10 మ్యాచ్లు ఆడాడు. హరియాణాకు చెందిన జయంత్ ఇటీవల ఎమర్జింగ్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. జయంత్ భారత్ తరపున 4 టెస్టులు, 1 వన్డే ఆడాడు.