సిట్ ఎదుట హాజరైన చార్మి

     Written by : smtv Desk | Wed, Jul 26, 2017, 10:31 AM

సిట్ ఎదుట హాజరైన చార్మి

హైదరాబాద్, జూలై 26 : డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం చార్మి సిట్ కార్యాలయానికి బౌన్సర్ లతో పాటు చేరుకున్నారు. ఆమెను నలుగురు మహిళా అధికారులు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత లు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా కెల్విన్ తో చార్మికి ఉన్న సంబంధం ఏంటని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

కెల్విన్ ఫోన్ లో "చార్మిదాదా" పేరుతో నంబర్ సేవ్ చేసి ఉండగా.. చార్మి, కెల్విన్ ల మధ్య సుమారు 1000 కి పైగా వాట్సప్ సంభాషణలు ఉన్నాయని సమాచారం. కాగా హైకోర్ట్ ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే రేపు మళ్ళీ చార్మిని విచారించనున్నట్లు సమచారం.





Untitled Document
Advertisements