హైదరాబాద్, జనవరి 7: మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఇటీవల 'విజేత' సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయం సాధించకపోయిన, నటన పరంగా, లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న ఆయన, పులివాసు దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించిన, చివరికి 'రియా చక్రవర్తి'ని ఖరారు చేసుకున్నారు. హిందీలో 'బ్యాంక్ చోర్', 'జలేబి', 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' .. సినిమాలతో ఆమె యూత్ కి బాగా చేరువైంది. తెలుగులో 'తూనీగ తూనీగ' చేసిన ఆమెకి నిరాశే మిగిలింది. మళ్లీ ఇప్పుడు కల్యాణ్ దేవ్ జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ .. పోసాని కృష్ణమురళి కీలకమైన పాత్రలను పోషించనున్నారు.