వంగవీటి మోహనరంగా విగ్రహం తొలగింపు...!!!

     Written by : smtv Desk | Mon, Jan 07, 2019, 02:05 PM

వంగవీటి మోహనరంగా విగ్రహం తొలగింపు...!!!

గుంటూరు, జనవరి 7: జిల్లాలోని తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంత దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాపునాడు వ్యవస్థాపకుడు వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలిగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న కాపునాడు నేతలు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు.

ప్రభుత్వం తీరును తప్పుబట్టిన వారు రంగా విగ్రహాన్ని కూల్చివేసిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాపునాడు నేతలను శాంతింప జేసే ప్రయత్నం చేస్తున్నారు.





Untitled Document
Advertisements