టీఆరెస్ నాయకులకు పోలీసు శాఖ నుండి లేఖ...

     Written by : smtv Desk | Mon, Jan 07, 2019, 06:03 PM

టీఆరెస్ నాయకులకు పోలీసు శాఖ నుండి లేఖ...

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ పోలీసు శాఖ రాష్ట్రంలోని పలు రాజకీయ నాయకులకి "మీరు వాడిన బులెట్ ప్రూఫ్ కారు బకాయిలు చెల్లించండి సర్..." అంటూ ఓ లేఖ రాసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కేసీఆర్ స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరించారు. కాగా.. ఈ ప్రచారంలో కేసీఆర్ ఉపయోగించిన బులెట్ ప్రూఫ్ వాహన బకాయిలు చెల్లించాలని పోలీసులు కేసీఆర్ ని కోరారు. కేసీఆర్ తోపాటు మరో 33మంది నేతలకు పోలీసులు లేఖలు రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు సీఎం కేసీఆర్ సహా 33మంది రాజకీయ నాయకులకు బెలెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత కల్పించినట్లు వారు వివరించారు. ప్రత్యేకంగా డ్రైవర్లను కూడా కేటాయించినట్లు పోలీసులు వివరించారు.

పోలీసులు లేఖలు రాసిన నేతల్లో సీఎం కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి, మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీలతో పాటు అన్ని పార్టీల స్టార్‌ క్యాంపెయనర్‌లు ఉన్నారని తెలిపింది. కిలోమీటర్ల ఆధారంగా ధరను నిర్ణయించామని, ఒక్కో నాయకుడు రూ.57 వేల నుంచి రూ.7.7 లక్షల వరకు బకాయి ఉన్నట్లు వెల్లడించింది.





Untitled Document
Advertisements