వామపక్షా నేతలతో పవన్ చర్చ

     Written by : smtv Desk | Tue, Jan 08, 2019, 01:39 PM

వామపక్షా నేతలతో పవన్ చర్చ

విజయవాడ, జనవరి 8: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్షాలతో పొత్తులను ఖరారు చేసే ప్రక్రియను మొదలు పెట్టారు. మంగళవారం ఆయన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో చర్చలు ప్రారంభించారు. అనంతరం సిపిఐ, సిపిఎం నేతలతో పవన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపారు. తర్వాత వామపక్ష నేతలతో కలిసి ఆయన పవన్ కల్యాణ్ నివాసానికి చేరుకున్నారు.

పవన్ కల్యాణ్ వామపక్ష నేతలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. తమ పార్టీ పోటీ చేసే స్థానాలను, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించే సీట్లను పవన్ కల్యాణ్ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements