హైదరాబాద్, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పై తీసుకున్న నిర్ణయాన్ని తెదేపా నేతలు మొదటి నుండే తప్పు బడుతూనే ఉన్నారు. తాజాగా మరో తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ బీజేపీ పై ధ్వజమెత్తారు. గిరిజనులు, మైనార్టీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొసలీ కన్నీరు కారుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
దేశ వ్యాప్తంగా బీజేపీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఎన్నికల కోసమే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లంటూ బీజేపీ స్వార్థ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పేదలపై మోదీకి నిజమైన ప్రేమ ఉంటే అఖిలపక్ష సమావేశం పెట్టాలన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు.. స్వార్థ రాజకీయాలకు పరాకాష్టగా ఆయన అభివర్ణించారు.