నేడు మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ముగింపు

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 01:20 PM

నేడు మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ముగింపు

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ పంచాయతి ఎన్నికల సందర్భంగా మూడు దశలో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో తొలి దశ నామినేషన్ల స్వీకరణ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలవరకు ఉంటుంది. కాగా గురువారం ఉదయం నామినేషన్లను పరిశీలించి, బరిలో నిలిచే అభ్యర్దుల జాబితా విడుదల చేస్తారు. ఉపసంహరణల గడువు ముగిసిన తర్వాత ఈ నెల 13న తుది జాబితాను విడుదల చేస్తారు.

అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్లు దాఖలుచేసిన అభ్యర్థులు ఇప్పటికే ఆయా గ్రామాలు, వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. గుర్తులు కేటాయించిన తర్వాత ప్రచారం మరింత వేడెక్కనుంది. ఈ నెల 21న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.





Untitled Document
Advertisements