పీబీఎల్-4 లో బెంగళూరు గెలుపు

     Written by : smtv Desk | Fri, Jan 11, 2019, 03:14 PM

పీబీఎల్-4 లో  బెంగళూరు గెలుపు

జనవరి 11: ఇండియాలో నిర్వహించే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్) నాలుగో సీసన్ లో గురువారం జరిగిన పోరులో బెంగళూరు రాప్టర్స్‌ 3–2తో చెన్నై స్మాషర్స్‌పై గెలిచింది. మొదటి మ్యాచ్ పురుషుల డబుల్స్‌లో బెంగళూరు జంట మొహమ్మద్‌ అహ్‌సాన్‌– సథియావాన్‌ 15–14, 9–15, 11–15తో క్రిస్‌ అడ్‌కాక్‌– చిన్‌ చుంగ్‌ జోడీ చేతిలో ఓటమి పాలైంది. తరువాత చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్ లో ప్రణీత్‌ (బెంగళూరు) 15–11, 15–12తో కశ్యప్‌పై గెలుపొందడంతో స్కోరు 1–0గా మారింది. బెంగళూరు ట్రంప్‌ మ్యాచ్‌ లో శ్రీకాంత్‌ 15–10, 15–10తో వీ ఫెంగ్‌ చోంగ్‌ (చెన్నై)పై గెలుపొందడంతో బెంగళూరు 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


మహిళల సింగిల్స్ లో థి త్రాంగ్‌వు 10–15, 15–14, 10–15తో సుంగ్‌ జీ హ్యూన్‌ (చెన్నై) చేతిలో ఓడిపోగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎలిస్‌– స్మిత్‌ జంట 8–15, 15–12, 4–15తో క్రిస్‌ అడ్‌కాక్‌– గాబ్రియెల్‌ అడ్‌కాక్‌ (చెన్నై) జోడీ చేతిలో ఓడినప్పటికీ 3–2తో విజయం బెంగళూరు వశమైంది. మొదటి స్థానంలో ఉన్న అవధ్‌ వారియర్స్‌తో బెంగళూరు రాప్టర్స్‌ నేడు సెమీస్ లో తలపడుతుంది.






Untitled Document
Advertisements