పంచకుల, జనవరి 12 : 16 సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధ్యక్షుడు గుర్మీత్ రామ్ రహీమ్ తో పాటు మరో ముగ్గురు దోషులుగా నిర్దారించారు. ఈ నేపద్యంలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి శుక్రవారం ఈ తీర్పు వెలువరించారు. ఇద్దరు మహిళా భక్తురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నడేరా బాబా జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. దోషులకు శిక్షను ఈ నెల 17న ఖరారు చేయనున్నారు.
ఈ సందర్బంగా హరియాణాలోని డేరా బాబా ఆశ్రమ పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని వివరిస్తూ గుర్తుతెలియని వ్యక్తి రాసిన లేఖ 2002 అక్టోబర్లో ‘పూరా సచ్’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత అదే పత్రికలో పనిచేస్తున్న రామ్చందర్ ఛత్రపతి అనే పాత్రికేయుడిని తుపాకీతో కాల్చి చంపేశారు.