సిడ్నీ, జనవరి 12: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 10,000 పరుగుల మైలురాయికి చేరాడు. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడు ఒన్డే సిరీస్ లో భాగంగా, సిడ్నీ వేదికగా జరుగుతున్నా తొలి వన్డే లో టీమిండియా ఆడుతున్నారు. ఇందులో ధోని 10,000 పరుగులు మార్క్ ని అందుకున్నాడు. ఇప్పటివరకు ధోని 333 మ్యాచ్ లు ఆడి 9,999 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్ ద్వారా 10,000 చేసిన ఐదవ భారత క్రికెటర్ ధోని. ఇప్పటివరకు భారత్ తరఫున సచిన్(18,426), సౌరవ్ గంగూలీ(11, 363), రాహుల్ ద్రావిడ్(10,889), విరాట్ కోహ్లి(10, 232) ఈ మైలురాయిని అందుకున్నారు.