వైఎస్సార్ మాకు దేవుడు

     Written by : smtv Desk | Sat, Feb 02, 2019, 02:06 PM

వైఎస్సార్ మాకు దేవుడు

మహానేత వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. శుక్రవారం సాయంత్రం ఎన్. కన్వెన్షన్ లో యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

దర్శకుడు మహి వి రాఘవ, వైఎస్సార్ పాత్రధారి మమ్ముట్టి, నిర్మాత విజయ్ చిల్లా, రచయిత పెంచల్ దాస్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో వైఎస్ అభిమాని రవి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేయడం జరిగిందట. వైఎస్ తమకు దేవుడు అంటూ రవి చెప్పిన ఎమోషనల్ స్పీచ్ అందరిని కన్నీళ్లు పెట్టించేసింది. 2008లో తన తల్లి గుండెలో రంద్రం ఉందని తెలిసి ఆపరేషన్ చేయాలని అన్నారు. లేదంటే 6 నెలలు మాత్రమే బ్రతుకుతుందని డాక్టర్లు హెచ్చరించారు. అప్పటికి హైదరాబాద్ వచ్చి కష్టపడినా 4 నెలల్లో కేవలం 20వేలు మాత్రమే సంపాదించా.. అమ్మ ఆరోగ్యం బాగుపడేందుకు ఎక్కని గుడి.. మొక్కని దేవుడు లేడని చెప్పాడు రవి.

ఏ దేవుడు వచ్చి అమ్మని కాపాడుతాడో అనుకున్నా అన్ని దేవుళ్లకి పూజలు చేశా.. 2009లో వైఎస్సార్ రూపంలో దేవుడు వచ్చాడు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అమ్మకి ఆపరేషన్ అయ్యింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రిందట ఆగిపోవాల్సిన ఆమె గొంతు ఇప్పటికి వినపడుతుంది. వైఎస్సార్ మాకు దేవుడు.. తన ఇంట్లో ఏ దేవుడు ఫోటో ఉండదు ఒక్క వైఎస్సార్ ది తప్ప తాను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా కూడా పనిచేశానని. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మహి, నిర్మాతలు విజయ్, శషిలకు తన కృతజ్ఞతలు తెలియచేశాడు రవి. సినిమా రిలీజ్ నాడు తన కుటుంబాన్ని మొత్తం ఈ సినిమాకు తీసుకెళ్లి చూపిస్తానని చెప్పాడు.





Untitled Document
Advertisements