ఎస్బిఐ బ్యాంకు లో అధికారుల చేతివాటం

     Written by : smtv Desk | Sat, Feb 02, 2019, 02:22 PM

ఎస్బిఐ బ్యాంకు లో అధికారుల చేతివాటం

హైదరాబాద్, ఫిబ్రవరి 2: పరకాల మండలం కంఠాత్మకూర్‌ లో ఎస్బిఐ బ్యాంకు అధికారుల అవినీతి బయట పడింది. పరకాల ఎస్‌బిఐ బ్యాంకులో విలీనానికి రూ. 2.15 కోట్లు దారి మళ్లించినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. బోగస్ కంపెనీలకు రుణాల పేరిట కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఎస్‌బిఐ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

ముద్ర, స్టాండప్‌ ఇండియా రుణాల పేరిట రూ. 2.15 కోట్లు చేతులు మారాయి. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిబిఐ దర్యాప్తు చేస్తున్నది. బ్యాంకు మనేగేర్ తో పటు మరో ఇద్దరిపై కాసు నమోదు చేసీ దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements