పూజా హెగ్దె రేటు పెంచేసిందట..!

     Written by : smtv Desk | Sat, Feb 02, 2019, 08:15 PM

పూజా హెగ్దె రేటు పెంచేసిందట..!

ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే భామల షార్టేజ్ వచ్చిందని చెప్పొచ్చు. స్టార్స్ పక్కన చేయాలంటే వారికి ఎంతోకొంత క్రేజ్ ఉండాల్సిందే. అయితే డిజేకి ముందు ఒకలాంటి పరిస్థితి ఉన్న పూజా హెగ్దె డిజేలో బికిని దెబ్బతో ఆడియెన్స్ ను ఫ్లాట్ చేసింది. బక్కపలచని భామే అయినా అమ్మడులో స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ ఉండటంతో డిజే తర్వాత సాక్ష్యం, అరవింద సమేత సినిమాలతో స్టార్ రేంజ్ అందుకుంది.

మహేష్ తో మహర్షి, ప్రభాస్ తో జాన్ సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్దె. టాలీవుడ్ లో తన అవసరం గుర్తించింది.. అందుకే అమ్మడు రెమ్యునరేషన్ పెంచేసింది. నిన్న మొన్నటి దాకా కోటి, కోటిన్నర తీసుకున్న పూజా మహర్షికి కోటి 70 లక్షలు తీసుకోగా.. ప్రభాస్ సినిమాకు 2 కోట్లు తీసుకుంటుందట. కాజల్, తమన్నా, అనుష్క లాంటి వారంతా దాదాపుగా అందరితో ఓ చుట్టేసిన వారే అందుకే స్టార్స్ ఇక వారితో చేయాలని అనుకోవడం లేదు. అందుకే పూజాకి మరింత డిమాండ్ పెరిగింది. ఛాన్సులు వస్తున్నాయి వాటికి తగినట్టుగా హిట్లు కూడా పడితే డిజే భామకు టాలీవుడ్ లో తిరుగు ఉండదని చెప్పొచ్చు.





Untitled Document
Advertisements