న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేఎస్ అళగిరిని నియమించారు. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా హెచ్ వసంత కుమార్, కె జయకుమార్, ఎంకే విష్ణు ప్రసాద్, మౌర్య జయకుమార్లను నియమించారు. తిరునావక్కరసర్, ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఇన్ని రోజులు ఆ పదవిలో ఉన్నందుకు ఆయనను రాహుల్ అభినందించారు. మరియం బీబీ, మియాని దాల్బోత్లను వరుసగా అండమాన్, నికోబార్ దీవులు, మేఘాలయల మహిళా కాంగ్రెస్లకు కార్యనిర్వాహక అధ్యక్షురాళ్లుగా రాహుల్ నియమించారు. లక్షద్వీప్కు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ, గుజరాత్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, చండీగఢ్ల ఏఐసీసీ ఎస్సీ విభాగంలోనూ కొందరిని రాహుల్ గాంధీ నియమించారు.