అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన కుమార్తె మరియం నవాజ్ ట్విటర్లో వెల్లడించారు.నవాజ్ షరీఫ్ లో గుండె సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని గుర్తించిన వైద్యులు ఆయన్ని లాహోర్ లోని ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులకు సూచించారు. అదే సమయంలో షరీఫ్ కు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓ అవినీతి కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడిన నవాజ్ షరీఫ్... ప్రస్తుతం కోట్ లఖ్పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.