ఈజిప్టులో వెలువడ్డ మమ్మిలు

     Written by : smtv Desk | Mon, Feb 04, 2019, 05:43 PM

ఈజిప్టులో వెలువడ్డ మమ్మిలు

ఈజిప్టులో తాజాగా జరిపిన తవ్వకాలలో 40కి పైగా మమ్మీలను పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధకులు గుర్తించారు. మధ్య ఈజిప్టు ప్రాంతంలోని ఓ పురాతన శ్మశానవాటికలో వీటిని కనుగొన్నారు. ఈ ప్రాంతం కైరోకు దక్షిణ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవి రోమన్‌ లేదా బైజాన్టియన్‌ కాలం నాటివిగా భావిస్తున్నారు. ఈ మమ్మిలలో పెద్దలు, పిల్లలతో పాటు జంతువులు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యం లో పురాతత్వ శాస్త్రవేత్త రమీ రస్మీ మాట్లాడుతూ, వారు గుర్తించిన వాటిలో 12 మంది చిన్నారులు, ఆరు జంతువులు ఉన్నాయని చెప్పారు. మిగిలిన వాటిలో పురుషులు, మహిళలు ఉన్నారని తెలిపారు. ఈజిప్టులోని తూర్పు మల్లావిలో టునా ఎల్‌ గెబల్‌ అనే ఒక ప్రదేశంలో భూమికి తొమ్మిది మీటర్ల లోతున రెండు సమాధులను కనుగొన్నామని వీటిలో ఆరుకు పైగా గదులు ఉన్నాయని మరో పురాతత్వ శాస్త్రవేత్త మొహమ్మద్ రగబ్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మిన్యా సమాధులు ఉన్న ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలను చేపట్టారు. ఈ సమాధులు బూర్జువా కుటుంబాలకు చెందినవై ఉండవచ్చని భావిస్తున్నారు. కొన్ని మమ్మీలపై ఆ కాలం నాటి భాషలో రాసిన విశేషాలు ఉన్నాయి. ఈ మమ్మీలను చాలా వరకు కుండల్లో భద్రపర్చారు.





Untitled Document
Advertisements