అదే నా ఆఖరి ప్రసంగం కావొచ్చు: మాజీ ప్రధాని

     Written by : smtv Desk | Sat, Feb 09, 2019, 09:19 AM

అదే నా ఆఖరి ప్రసంగం కావొచ్చు: మాజీ ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: మాజీ ప్రధాన మంత్రి దేవె గౌడ(85) రానున్న లోక్ సభ ఎన్నికలలో తను పోటి చేయకపోవచ్చనే సంకేతాలనిచ్చారు. శుక్రవారం నాడు మాట్లాడుతూ, మధ్యంతర బడ్జెట్‌పై సోమవారం తాను లోక్‌సభలో మాట్లాడేదే తన చివరి ప్రసంగం కావచ్చనీ, కాబట్టి ఆరోజున తనకు మరింత ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరానని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేవె గౌడ 320 రోజులు ప్రధానిగా చేశారు. ప్రధానిగా ఉన్న సమయంలో తాను దేశానికి ఏం చేసాడో ఎక్కువ మందికి తెలీదు కాబట్టి పార్లమెంటులో దీనిపై మాట్లాడతానన్నారు. బడ్జెట్‌పై చర్చ సమయంలో కాంగ్రెస్‌కు కేటాయించిన సమయంలోనూ తనకు కొంత ఇవ్వాలని తాను ఆ పార్టీని కోరతానన్నారు. దేవె గౌడ ప్రస్తుతం హసన్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.





Untitled Document
Advertisements