న్యూఢిల్లీ , ఫిబ్రవరి 09:భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ భారత్ చేరుకున్నారు. క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికాలోని న్యూయార్క్కు వెళ్లిన మంత్రి ఇవాళ భారత్కు తిరిగొచ్చారు. ఆయన చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లడంతో ఆయన స్థానంలో తాత్కాలిక ఆర్ధిక మంత్రి పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం సుపరిచితమే . స్వదేశానికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందని జైట్లి సామజిక మాధ్యమం ట్విట్టర్లో పేర్కోన్నారు.