ధోని దేశభక్తి ప్రపంచానికి తెలిసింది.. జై హో భారత్!!

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 08:52 AM

ధోని దేశభక్తి ప్రపంచానికి తెలిసింది.. జై హో భారత్!!

స్పోర్ట్స్, ఫిబ్రవరి11: ఎంఎస్ ధోనీ ప్రపంచ క్రికెట్ లో ఈ పేరు తెలియని వారు వుండరు. భారత్ సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషించిన ధోని క్రికెట్ మ్యాచ్ ఆడే సమయంలో ఎంతటి అంకితభావంతో ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

క్రికెట్ కాకుండా ధోనీ 'లెఫ్టినెంట్ కల్నల్' హోదాలో భారత సైన్యం గౌరవ పదవిని నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. కాగ నిన్న న్యూజిలాండ్ తో మూడో టీ-20 జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన ధోనికి గల దేశభక్తిని ప్రపంచానికి తెలియచేసింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని మైదానంలోకి దూసుకొచ్చి, నేరుగా ధోనిని చేరుకుని పాదాభివందనం చేశాడు. ఆ సమయంలో అతని చేతిలో ఉన్న భారత జాతీయ జెండా నేలను తాకగా, ఆ వెంటనే ధోనీ దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తరువాతే ఆ అభిమానిని వారించి, పైకి లేపాడు. త్రివర్ణ పతాకం నేలకు తగలకుండా చేసిన ధోనీ దేశభక్తికి ఇప్పుడు ప్రతిఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.





Untitled Document
Advertisements