ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకలేం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 08:56 AM

ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకలేం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష నిప్పులు చెరుగుతూ మొదలైంది. నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీకి, పరిపాలించే అర్హత ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించారు.

ప్రసంగంలో మాట్లాడుతూ చంద్రబాబు, "ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. పరిపాలించే వ్యక్తులు ప్రజల మనోభావాలను గుర్తు పెట్టుకుని, పరిపాలిస్తే, దేశ సమగ్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితి వస్తుంది. మేము ఢిల్లీలో ఉన్నాం. మాకు అధికారం ఇచ్చారు. మెజారిటీ ఉంది. మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే మీ ఆటలు సాగవని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. బాధ్యత విస్మరించి, ఇష్టానుసారం చేస్తామని, అధికారం నెత్తికెక్కినప్పుడు, మళ్లీ ఆ నెత్తికెక్కిన అధికారాన్ని దించే అధికారం ఈ ప్రజలకు ఉందని గుర్తు పెట్టుకోవాలి. మనం పోరాడేది మన కోసం కాదు, ఐదు కోట్ల మంది ప్రజల కోసం పోరాడుతున్నాం. భావి తరాల కోసం పోరాడుతున్నాం. ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నాం. జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకోవచ్చుగానీ, ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకలేమని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు" అన్నారు.





Untitled Document
Advertisements