న్యూడిల్లీ, ఫిబ్రవరి 11: దేశ రాజధానిలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్ లోని భోజ్పురికి చెందిన సౌరబ్ అనే 30 ఏళ్ల యువకుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం డిల్లీకి వచ్చి న్యూ అశోక్ నగర్ లోని ఒక గదిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఉద్యోగం కోసం చాలాకాలం నుండి ప్రయత్నించి ఇక ఉద్యోగం రాదని నిరాశ చెంది ఆవేదనతో సౌరబ్ మయూర్ విహార్ ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కింద పడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్నిస్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించారు. అతని దగ్గర ఉన్న డైరీ ని పరిశీలించగా ఉద్యోగం రానందువల్లనే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.