ఢిల్లీలో చంద్రబాబు దీక్ష కు మద్దతు ప్రకటించిన రాహుల్ గాంధీ

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 11:15 AM

ఢిల్లీలో చంద్రబాబు దీక్ష కు మద్దతు ప్రకటించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ధర్మపోరాట దీక్ష గురించి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందని ఢిల్లీలో ఈ దీక్షను ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ మోదీ లక్ష్యంగా నిప్పులు కురిపించారు.

ఈ దీక్షకు జాతీయ నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అంతకముందు ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా దీక్ష వేదిక వద్దకు వచ్చి బాబుకు మద్దతు పలికారు.





Untitled Document
Advertisements