న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శారద గ్రూప్ పేరుతో 200 ప్రైవేటు సంస్థలు నడిపిన పొంజీ స్కీం నష్టపోవడంతో కోటి 70 లక్షల మంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడిన సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. కాగా ఈ కేసు దర్యాప్తు మేరకు ఇప్పటికే పలువురు ప్రముఖులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబందించిన ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సీబీఐ విచారిస్తుంది. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్ ఘోష్ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.