ఈ రైలులో టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, క్యాటరింగ్‌ సర్వీసులు టికెట్‌ చార్జీ లోనే

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 12:54 PM

ఈ రైలులో టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, క్యాటరింగ్‌ సర్వీసులు టికెట్‌   చార్జీ లోనే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌–18) త్వరలో పట్టలేక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైల్లో మాత్రం క్యాటరింగ్‌ చార్జీలు కూడా టికెట్‌ చార్జీలతో కలిపి ముందే చెల్లించాల్సి ఉంటుంది. శతాబ్ది, రాజధాని, దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోలాగా ఆప్షనల్‌గా తిరస్కరించడానికి వీలు ఉండదని అధికారులు తెలిపారు. కాగా అలహాబాద్-వారణాసి మధ్యలో ఎక్కే ప్రయాణికులకు మాత్రం మినహాయింపునిచ్చారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 15న వారణాసి నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించనున్నారు.

ఈ రైలులో రెండు రకాల క్యాటరింగ్‌ చార్జీలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కింద రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ ఉంటుంది.

చెర్‌కార్‌ అయితే అదే భోజన సదుపాయాలకు రూ. 344 చెల్లించాల్సి ఉంటుంది. స్టేషన్ల బట్టి ఈ చార్జీల్లో మార్పులుంటాయి. కాగా ఈ రైలు మొత్తం 755 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 8 గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తుంది. ఈ రైలుకు కాన్పూర్, ప్రయాగరాజ్‌ స్టేషన్లలో స్టాపులుంటాయి.





Untitled Document
Advertisements