పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...!

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 01:18 PM

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...!

న్యూడిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో మళ్ళీ ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ పై 5పైసలు, డీజిల్ పై 6 పైసలు ధర పెంచుతున్నట్లు సోమవారం ఐఓసీఎల్ ప్రకటిచింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో మాత్రం ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.67 డాలర్లు ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 52.17 డాలర్లు ఉంది.

పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ. 70.33కు, డీజిల్ ధర 65.62కు చేరింది. వాణిజ్య రాజధాని అయిన ముంబైలో ధర రూ. 75.97కు, డీజిల్ ధర రూ. 68.71కి చేరింది. ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.62, డీజిల్‌ ధర రూ.71.34. బెంగుళూరులో పెట్రోలు రూ. 72.65, డీజిల్‌ రూ. 67.78కు చేరింది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ. 72.44కు, డీజిల్‌ ధర రూ. 67.40కు చేరగా, చెన్నైలో పెట్రోలు ధర రూ. 73.00కు, డీజిల్‌ ధర రూ. 69.32కు పెరిగింది.





Untitled Document
Advertisements