ప్రపంచ కప్ రేసులో ఆ ముగ్గురు : చీఫ్‌ సెలక్టర్

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 02:12 PM

ప్రపంచ కప్ రేసులో ఆ ముగ్గురు : చీఫ్‌ సెలక్టర్

స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 11: మరో మూడు నెలల్లో ఇంగ్లండ్‌ వేదికగా వరల్డ్‌కప్‌ సమరానికి సిద్దమవుతుంది. అందుకు తగ్గట్లు ఆయ దేశాలు వారి వారి జట్ట్లని తయారు చేసుకుంటున్నాయి. వరల్డ్ కప్ సన్నహకల్లో బాగం గా భారత్ కూడా తమ జట్టు కూర్పు పై కన్నేసింది. ఒకవైపు యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే వారి బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా ఒక కన్నేసి ఉంచింది. దీనిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

ఈ సిరీస్‌లో విజయ్‌ శంకర్‌ బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడి తాను కూడా వరల్డ్‌కప్‌ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపాడు. తాజాగా విజయ్‌ శంకర్‌ స్థానంపై టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప‍్రసాద్‌ సూత్రప్రాయంగా స్పష్టత ఇచ్చాడు. ఆ మెగా టోర్నీలో భాగంగా విజయ్‌ శంకర్‌ కూడా తన ప్రణాళికల్లో ఉన్నాడంటూ పేర్కొన్నాడు.

విజయ్‌తో పాటు రిషభ్‌ పంత్‌, అజింక్యా రహానేలు కూడా వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టు ప్రాబబుల్స్‌ కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలిపాడు. ఏప్రిల్‌ 23వ తేదీ జట్లు ఎంపికకు చివరి తేదీ కాగా, ఈలోపు పూర్తిస్థాయి జాబితాను సిద్ధం చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్‌ తర్జన భర్జన పడుతోంది. భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ, విజయ్‌ శంకర్‌, రిషభ్‌ పంత్‌, అజింక్యా రహానేలు వరల్డ్‌కప్‌ రేసులో ఉన్నట్లు తెలిపాడు.

ఇప‍్పటికే రిషభ్‌ పంత్‌ తానెంటో నిరూపించుకోగా, తాజాగా విజయ్‌ శంకర్‌పై మేనేజ్‌మెంట్‌ ఒక స్సష్టతకు వచ్చినట్లు పేర్కొన్నాడు. గత రెండేళ్ల నుంచి భారత్‌-ఎ తరఫున విజయ్‌ శంకర్‌ నిలకడగా ఆడుతున్న విషయాన్ని కూడా ఎంఎస్‌కే ఈ సందర్భంగా తెలిపాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న రహానే వరల్డ్‌కప్‌ ఎంపిక రేసులో ముందువరుసలో ఉన్నాడన్నాడు.

ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌లో మూడో ఓపెనర్‌గా రహానేను పరిశీలించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవల లిస్ట్‌-ఎ క్రికెట్‌లో రహానే తన మార్కు ఆట తీరును చూపించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 74.62 సగటుతో 597 పరుగులు సాధంచాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.





Untitled Document
Advertisements